రాజమండ్రి మాజీ ఎంపీకి కరోనా పాజిటివ్..!

కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృభిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరి నుంచి కరోనా సోకుతుందో ఎవరికి అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు, డాక్టర్లతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ మధ్య ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.

ప్రస్తుతం రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కి కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అనేక అంశాల మీద మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు ఉండవల్లి. కరోనా కారణంగా చాలా రోజుల నుంచి మీడియా ముందుకు రావడం లేదు. గత రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్‌ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన రాజమండ్రిలో హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here