టాలీవుడ్ సెలిబ్రిటీ పిల్లలో ప్రిన్స్ మహేష్ బాబు పిల్లలు కూడా ఒకరు. గౌతమ్ ఇప్పటికే వెండితెరపై నటించగా, సితార సోషల్ మీడియాలో తన అల్లరి మాటలతో ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ భార్య.. నమ్రత తమ చిన్నారుల్లో ఉన్న మరో ట్యాలెంట్ను బయటపెట్టింది.
సితార, గౌతమ్ ఇంట్లో ఈత కొడుతోన్న సమయంలో తీసిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన నమ్రత.. ‘మా చిన్నారులు ఒలింపిక్స్కు సిద్ధమవుతున్నారు. పిల్లలను వారికి నచ్చిన పనులను వారు ఇచ్చమొచ్చినట్లు చేయమని చెబుతుంటాను. ఎక్సర్సైజ్తో పాటు వేరే ఆటలు ఆడుతూ ఉంటే.. మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చిందీ సూపర్ మామ్.
ఇక ఒకప్పుడు సినిమాల్లో నటించిన నమ్రత మహేష్తో వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. అప్పటి నుంచి కుటుంబానికే పరిమితమైంది. అయితే ఇటీవల మహేష్బాబు సినిమాలకు సంబంధించిన వ్యవహారాలను నమ్రతనే చూసుకుంటోంది. ఈ విధంగా నమ్రతా మళ్లీ ఇండస్ట్రీకి దగ్గరవుతోందన్నమాట.