విలువిద్య నేపథ్యంలో నాగశౌర్య కొత్త సినిమా..

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రూపొందుతోంది. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో… సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇక ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన కోవిడ్ నిబంధనల మేరకు ఈ చిత్రాన్ని సెప్టెంబరు 18 నుంచి సెట్స్‌పైకి   తీసుకెళ్లనున్నారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది.

ఇక ఈ సినిమా విశేషాల గురించి నిర్మాతలు చెబుతూ..

‘ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్‌ డ్రామా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నాం. ఇందులో నాగశౌర్య విలుకాడిగా కనిపించనున్నారు. ఆయన పాత్ర, లుక్‌ ఆకట్టుకునేలా ఉంటాయి. అన్ని ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. సెప్టెంబరు 18 నుంచి నిరంతరాయంగా చిత్రీకరణ జరుపుతాం’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఇది వరకే విడుదల చేసిన ఈ సినిమాలోని నాగ శౌర్య ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here