అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ డాం సంపాదించాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి హిట్ తో వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో విజయ్ దేవరకొండ చేతినిండా సినిమాలను ఒప్పుకొన్నాడు. అయితే ఈ క్రమంలో ఆ సినిమాలను పూర్తి చేయడానికి తెగ కష్టపడుతున్నాడు అర్జున్ రెడ్డి హీరో.ఈ నేపథ్యంలో విజయ దేవరకొండ తో సినిమాలు చేయడానికి ఇతర దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా విజయ్ దేవరకొండతో జూన్ తరువాత ఓ సినిమాను చేయడానికి రెడీ అవుతోంది.
ఇందుకోసం విజయ్ దేవరకొండకి రెండున్నర కోట్లను అడ్వాన్స్ గా కూడా ఇచ్చినట్టు సమాచారం.మైత్రీ మూవీ నిర్మించే సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన రష్మిక మందనను హీరోయిన్గా తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ చేస్తోన్న సినిమాలో కథానాయికగా రష్మిక చేస్తోంది. అదే జోడీతో మైత్రీ మూవీ మేకర్స్ వారు సినిమాను ప్లాన్ చేస్తుండటం విశేషం. అయితే ఈ సినిమా కొత్త దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతుంది అంటున్నారు.