గో నిషేధం కి సంబంధించి ఎన్డీయే సర్కారు తీసుకున్న అతిపెద్ద నిర్ణయానికి దేశం మొత్తం షాక్ అయ్యింది. దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల బిజినెస్ పూర్తిగా ఆగిపోయింది. కనీసం ఇరవై లక్షల మంది ఉపాథి ని కోల్పోయారు అని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. దేశీయ మాంసం పరిశ్రమ లో లక్షల్లో ముస్లిం లు ఉన్నారు. ఇతర మతస్తులు పశువులను వ్యవసాయం, పాడి పరిశ్రమకు వాడుతున్న వారిలో అధికులుగా ఉండగా, వాటి వధపై నిషేదంతో ముస్లింలకు జీవనోపాధి దూరమైందని ముస్లిం ఆల్ ఇండియా జమియాతుల్ ఖురేష్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ ఫాహీమ్ ఖురేషీ వ్యాఖ్యానించారు.
నూట ముప్పై కోట్ల భారత లో 14 శాతం ఉన్న ముస్లిం ల మీద ఈ నిర్ణయం గట్టిగా ఉంటుంది అనీ మత కల్లోలాలు జరిగినా కూడా ఆశ్చర్యపడక్కరలేదు అన్నారు ఆయన. మోడీ వచ్చిన తరవాత ముస్లిం లలో నెలకొన్న ఆందోళన ఇంకా పెంచేలా ఈయన నిర్ణయం ఉంది అన్నారు .