సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ముఖేష్ అంబానీ..

ప్ర‌పంచంలో అత్యంత ధ‌నిక‌మైన వ్య‌క్తి ఎవ‌రంటే మ‌న‌కు గుర్తొచ్చే పేరు ముఖ్యంగా ముఖేష్ అంబానీ. ప్ర‌తియేటా ఆయ‌న సంప‌ద పెరుగుతూనే ఉంది త‌ప్ప త‌ర‌గ‌డం లేదు. దీంతో ఆయ‌న ప్ర‌పంచంలోని అత్యంత ధ‌నికుల జాబితాలో ఉన్నారు.

తాజాగా ముఖేష్ అంబానీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఉత్త‌రాఖండ్‌లోని చార్‌థామ్ దేవ‌స్థానంకు రూ. 5 కోట్లు విరాళం అంద‌జేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆల‌యానికి ఏర్ప‌డిన ఆర్థిక లోటును పూడ్చేందుకు ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ముఖేష్ అంబానీ పెద్ద మ‌న‌సు చాటుకున్నార‌ని అంతా ఆయ‌న్ను ప్ర‌శంసిస్తున్నారు. విష‌య‌మేమిటంటే క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయిన విష‌యం తెలిసిందే.

ఇందులో భాగంగానే త‌మ ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించేందుకు స‌హాయం చేయాల‌ని చార్‌థామ్ దేవ‌స్థానం బోర్డు ముఖేష్ అంబానీని కోరింది. దీంతో స్పందించిన ఆయ‌న రూ. 5 కోట్లు ఆల‌య బోర్డుకు అంద‌జేశారు. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ చేతుల మీదుగా అంద‌జేసిన‌ట్లు ఆల‌య బోర్డు అద‌న‌పు సీఈఓ బి.డి.సింగ్ తెలిపారు. అంబానీ స‌హాయంతో ఉద్యోగులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. విష‌యం తెలిసిన వారంతా ముఖేష్ స‌హాయం చేయ‌డం ఎంతో గొప్ప విష‌య‌మ‌న్నారు. ఆయ‌న ఎంత స‌హాయం చేసినా చాలా త‌క్కువే అనే వారు కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here