తెలంగాణా – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన టైం లో సోనియా గాంధీ – కెసిఆర్ ల మధ్యన చాలా ఒప్పందాలు జరిగాయి అంటూ ఉంటారు. ఈ విషయం మీద టీటీడీపీ నేత పెద్ది రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా రాష్ట్రం ఇస్తే తెరాస ని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అని చెప్పి మోసం చేసిన కెసిఆర్ ని ప్రధాని మోడీ నమ్మే పరిస్థితే లేదు అన్నారు ఆయన. ” కెసిఆర్ మనస్త్వత్వం ఏంటో చక్కగా తెలుసు పెద్దాయన మోడీ కి అందుకే మోడీ అసలు ఈ కెసిఆర్ ని నమ్మే పరిస్థితే లేదు.
సోనియాతో పాటు తెలంగాణా జనాలని కూడా మోసం చేసిన చరిత్ర కెసిఆర్ కి ఉంది. ఇక మోడీ ఆయన్ని ఎలా నమ్ముతారు ? ” అన్నారు పెద్ది రెడ్డి. టీడీపీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, సైకిల్ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ లో చేరినవారు హైదరాబాద్ నగరం పరువు తీశారని ఎద్దేవా చేశారు.