ఆ సినిమా పోస్టర్ మోడీ కి తెగ నచ్చేసింది

సోషల్ మీడియా లో సందర్భానుసారంగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తారు నరేంద్ర మోడీ. తన అభిమానులని తన మాటలతో నే తేలికగా ఆకట్టుకునే మోడీ కొందరికి స్పందన కూడా తెలియ జేస్తారు.  ప్రధాని నరేంద్ర మోదీని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే సాహూ అనే వ్యక్తి నైనిటాల్ లో అతికించిన ఓ సినిమా పోస్టర్ ను ప్రధానికి ట్యాగ్ చేస్తూ ఒక ఫోటోను పెట్టారు . అది ఆయనకి బాగా నచ్చింది.
స్వచ్చ భరత్ ని వాడుకుని సినిమా పోస్టర్ చేయడం మోడీ మెచ్చిన విషయం.
హహహ పరిశుభ్రత గురించి చెప్పేందుకు సినిమా పోస్టర్ ను వాడుకున్నారు….వినూత్నమైన ఆలోచన అంటూ దానిని రీ ట్వీట్ చేశారు. ఎనభై లలో వచ్చిన దీవార్ అనే సినిమా పోస్టర్ అది ఈ సినిమాలో అమితాబ్ , శశి కపూర్ లు తల్లి కోసం కొట్టుకుంటూ ఉంటారు. తల్లి పాత్రధారి నిరూపా రాయ్..’మీ ఇద్దరిలో ఎవరైతే ముందు మరుగుదొడ్డి కట్టిస్తారో…నేను వారి దగ్గరే ఉంటాన’న్న డైలాగ్ ను ఆ పోస్టర్ పై ముద్రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here