ల‌వ్ మ్యారేజ్‌లో ఎమ్మెల్యే గెలిచాడు..

ఓ ఎమ్మెల్యే ల‌వ్ మ్యారేజ్ చేసుకోగా దీన్ని స‌వాల్ చేస్తూ యువ‌తి తండ్రి కోర్టును ఆశ్ర‌యించారు. అయితే మొత్తానికి ఈ కేసులో అమ్మాయి స‌పోర్టుతో ఎమ్మోల్యేనే గెలిచారు. ఇది త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. కోర్టుకు వ‌చ్చిన అమ్మాయి త‌న భ‌ర్తతో ఉండేందుకు ఇష్ట‌ప‌డింది.

త‌మిళ‌నాడులోని క‌ళ్ల‌కురిచ్చి ఎమ్మెల్యే ప్ర‌భు.. ఓ ఆల‌య అర్చ‌కుడు స్వామినాథ‌న్ కూతురు సౌంద్యర్య‌ను ప్రేమించారు. వీరిద్ద‌రూ ఈ సోమ‌వారం వివాహం చేసుకున్నారు. అయితే ఈ విష‌యం తెలుసుకున్న యువ‌తి కుటుంబ స‌భ్యులు దీన్ని తీవ్రంగా ఖండించారు. త‌మ అమ్మాయిని బ‌ల‌వంతంగా పెళ్లి చేసుకున్నారంటూ యువ‌తి తండ్రి ఆత్మ‌హ‌త్య‌య‌త్నానికి ప్ర‌య‌త్నించారు. అనంత‌రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంత‌రం కోర్టులో పిటిష‌న్ కూడా వేశారు.

త‌మ‌ను ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యులు బెదిరిస్తున్నార‌ని.. త‌మ కూతురుని కోర్టులో హాజ‌రుప‌రుచాల‌ని హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ వేశారు. కాగా నేడు హైకోర్టులో ఎమ్మెల్యే త‌న భార్య‌తో క‌లిసి వ‌చ్చారు. కోర్టులో ఆ యువ‌తి తాను ఇష్ట‌పూర్వ‌కంగానే పెళ్లి చేసుకున్న‌ట్లు తెలిపింది. ఇరువురి వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం ఇద్ద‌రూ మేజ‌ర్లు అయిన నేప‌థ్యంలో వీరి వివాహం చెల్లుతుంద‌ని పేర్కొంది. విష‌యం తెలిసిన అంద‌రూ ఎమ్మెల్యే గెలిచార‌ని కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here