తెలంగాణాలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్

మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఊహించని తీవ్ర స్థాయిలో పెరిగిపోతుంది. దీనితో సామాన్య ప్రజలతో పాటుగా ప్రజా ప్రతినిధులు కూడా దీని బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు మరియు ఇతర నేతలు కరోనా బారిన పడ్డారు.

అయితే ఇప్పుడు తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. నిజామాబాద్ ఆర్ముర్ నియోజకవర్గం ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయం మంగళవారం రాత్రి తెలియడంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హోం ఐసోలేషన్‌లో ఉండిపోయారు. ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారి ఫలితాలు రావాల్సి ఉంది. హోం ఐసోలేషన్‌లో ఉన్న జీవన్ రెడ్డికి వైద్యులచే కరోనా చికిత్స అందుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here