ఏపీ మంత్రి బొత్స ఇంట్లో తీవ్ర విషాదం..!

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం నెలకొంది.  బొత్స తల్లి ఈశ్వరమ్మ నేడు తెల్లవారుజామున కన్నుమూశారు.ఆమె వయసు 84 సంవత్సరాలు. దీనితో ఆయనకు మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా ఆమె ఆనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ వచ్చారు.

ఆరోగ్యం క్షీణించడంతో నేడు తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. దీంతో బొత్స ఇంట విషాదం నెలకొంది. ఈశ్వరమ్మకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు కాగా మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు. రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరంలోని స్వర్ఘధామంలో ఆమె అంత్యక్రియలు జరపనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here