చిరంజీవి ముగ్గురు దర్శకులు ఒకే చోట..!

రాజకీయాల్లో అడుగు పెట్టిన సమయంలో చిరంజీవి కొన్నేళ్ల పాటు సినిమాలకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే బాస్ ఇజ్ బ్యాక్ అంటూ.. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమా విజయంతో తనలో పవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఇక ఈ సినిమా తర్వాత సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించిన చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత.. వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయిన చిరంజీవి.. ఏకంగా మూడు సినిమాలను లైన్ లో పెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
చిరంజీవితో సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతున్న ముగ్గురు దర్శకులు తాజాగా ఒకచోట కలవడంతో ఇప్పుడీ అంశం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. శుక్రవారం వివి వినాయక్ పుట్టినరోజు కావడంతో దర్శకుడు మెహర్ రమేష్, బాబీ.. ఆయన ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో ముగ్గురు దర్శకులు కలిసి ఓ సెల్ఫీ ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
తమిళంలో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న వేదాళం రీమేక్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడని ఓ టాక్ నడుస్తోంది. ఇక లూసిఫర్ రీమేక్ ను వి.వి.వినాయక్ తెరకెక్కించనున్నాడన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి చిరు ఓకే చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ముగ్గురు దర్శకులు కలిసి దిగిన ఫోటోతో ఈ వార్తలకు క్లారిటీ వచ్చినట్లయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here