గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమదేవి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నటి అనుష్క ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది.
రుద్రమదేవి పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ..’ఈ ప్రయాణం నాకు చాలా ప్రత్యేకమైనది. అల్లు అర్జున్, రానాలు ఈ ప్రయాణాన్ని ఇంకా అద్భుతంగా మలిచారు. చరిత్రని ఇంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకొచ్చినందుకు దర్శకుడు గుణశేఖర్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రుద్రమదేవి ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను’ అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది స్వీటీ.
This journey is very special for me 😊 @alluarjun & @RanaDaggubati ..you guys made it wonderful🤗My heartfelt thanks to Director @Gunasekhar1 garu&team for brining the Glorious history on the screen at such a massive scale😊Congratulations on #5YearsOfRudhramadevi to all of us👏 pic.twitter.com/GB4w5yY0kS
— Anushka Shetty (@MsAnushkaShetty) October 9, 2020
దర్శకుడు గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించిన ఈ సినిమాను తెరకెక్కించడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. దీంతో స్వయంగా గుణశేఖర్ ఏకంగా రూ. 80 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తొలి భారతీయ స్టీరియో స్కోపిక్ త్రీడి చిత్రంగా రూపొందించడం విశేషం.