భారత్ను టార్గెట్ చేయడానికి ఉగ్రవాదులు ఎప్పుడు సిద్దంగానే ఉంటారు. ఇప్పటికే పలుమార్లు ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి ఉగ్రవాదులు ఇండియాను టార్గెట్ చేశారు. అయితే ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ గుర్తించింది.
భారత్ను టార్గెట్ చేస్తూ మలేషియా ఉగ్రవాదులు పన్నిన భారీ వ్యూహాన్ని భారత్ నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక్కడి ఆపరేషన్ కోసం ఉగ్రవాదులు ఏకంగా 2లక్షల డాలర్లు కేటాయించినట్టు భారత్ ఇంటెలిజెన్స్ సంస్థ రా(ఆర్ఏడబ్ల్యూ) గుర్తించింది. ఇందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై గట్టి నిఘా పెట్టిన రా..దీని వెనుకాల రొహింగ్యా నేత మహ్మద్ నసీర్ ఉన్నట్టు గుర్తించింది. కౌలాలంపూర్ కేంద్రంగా నసీర్ ఉగ్ర వ్యూహాలు రచిస్తుంటాడని తెలుస్తోంది.
అయితే.. ఈ కుట్రలో వివాదాస్పద మతప్రచారకుడు జకీర్ నాయక్ పాత్ర కూడా ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. భారత్పై దాడి చేసేందుకు మయాన్మార్కు చెందిన ఓ మహిళకు మలేషియా ఉగ్రవాదులు శిక్షణ కూడా ఇచ్చాయని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. భారత్లో దాడి చేయబోయే బృందానికి ఈ మహిళే నాయకత్వం వహిస్తుంది. బాంగ్లాదేశ్ లేదా నేపాల్ సరిహద్దుల గుండా నేపాల్లోకి ప్రవేశించాలనేది టెర్రరిస్టుల ప్లాన్. ఢిల్లీ, అయోధ్య, బోధ్గయా, పశ్చిమ బెంగాల్ లోని కీలక నగరాలు, శ్రీనగర్ను టెర్రర్ మూకల టార్గెట్ అయి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలు హై ఎలర్ట్లో ఉండాలంటూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కేంద్రం నుంచి సూచనలు వెళ్లాయి. జాతీయ మీడియాకు లంభించిన కీలక నిఘా నివేదికల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.