కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థలతో పాటు మానవ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. మనుషుల మధ్య దూరాన్ని పెంచింది. ఒక ఇంట్లోనే ఉండే వ్యక్తులు దూరంగా ఉంటున్నారు. తాజాగా కరోనా బారినపడిన హీరోయిన్ మలైకా అరోరా ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.
ఈ క్రమంలో తన కుమారుడిని, పెంపుడు శునకాన్ని ఎంతలా మిస్ అవుతుందో తెలుపుతూ.. ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది.గోడకు అవతలవైపు నుంచి అర్హాన్, కాస్పర్ మలైకాను చూస్తున్న ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తూ.. ‘ప్రేమకు హద్దులు లేవు. ఈ భౌతిక దూరం, స్వీయ నిర్బంధంలో మేము ఒకరినొకరు చూసుకోవడానికి, మాట్లాడటానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాము.
నా పిల్లలను ఇంకా కొన్ని రోజులు కౌగిలించుకోలేనన్న ఆలోచన నన్ను తీవ్రంగా బాధిస్తోంది. మీరే నా ధైర్యం, బలం’ అంటూ భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు.