సినీ ప్రేమ జంటల్లో నయన తార, విజ్ఞేశ్ లు ఒకరు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నాసరే ఒకరికోసం మరొకరు సమయాన్ని కేటాయించుకుందీ జంట. కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు… రెక్కలు కట్టుకొని పర్యాటక ప్రదేశాల్లో వాలిపోతుంటారు. ఏకాంతంగా గడిపే ఈ జంట వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం ఈ జంటకు అలవాటు.
అయితే కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ఈ జంట ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఇస్తోన్న సడలింపులతో మళ్లీ విహార యాత్రను తిరిగి ప్రారంభించింది. తాజాగా ఈ లవ్లీ కపుల్ గోవాలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ సేద తీరుతోన్న సమయంలో నయనతార దిగిన ఫొటోలను
విజ్ఞేశ్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. పకృతి అందాలను ఆస్వాదిస్తూ తెల్లటి గౌనులో ఏంజెల్లా కనిపిస్తోంది నయన్. ఇక ఈ ఫొటోకు తెలుపు ఎప్పుడూ ఆధ్బుతమే అనే క్యాప్షన్ జోడించాడు విజ్ఞేశ్.