అమెరికాలో ‘సర్కారు వారి పాట’.. !

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘ సర్కారు వారి పాట’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన మహేష్ ఫస్ట్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో సహజంగానే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘సర్కారు వారి పాట’ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ నుంచి ప్రారంభించాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఇందుకోసం చిత్ర యూనిట్ అమెరికాకు వెళ్లనుంది. అక్కడ రెండు షెడ్యూల్లను ప్లాన్ చేసినట్లు సమాచారం. మొదటి షెడ్యూల్ లో కీలక యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్న పాత్రల్లో  నటించనున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక పాత్ర పాన్ బ్రోకర్ కాగా.. మరో పాత్రలో బ్యాంక్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని సమాచారం. ఈ వార్తలపై ఓ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here