బాహుబలి రెండు భాగాలకీ తనదైన శైలి లో ప్రమోషన్ లు చేసుకుని చాలా తక్కువ బడ్జెట్ కి సినిమా ని కొనుక్కుని కోట్లు గడించాడు ప్రొడ్యూసర్ – డైరెక్టర్ కరణ్ జోహార్. బాహుబలి ఇచ్చిన ఊపు తో తన సొంత సినిమాగా ఘాజీ ని విడుదల చేసిన కరణ్ ఆ సినిమాతో కూడా సూపర్ రిజల్ట్ దక్కించుకున్నాడు. ఇప్పుడు మనోడు మరొక తెలుగు సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ సినిమా స్పైడర్ విషయం లో కరణ్ జోహార్ చాలా పాజిటివ్ గా ఉన్నాడు.
టీజర్ చూసి సినిమా మీద అంచనాలు పెంచుకున్న కరణ్ డైరెక్ట్ గా మహేష్ నే సినిమా హక్కులు హిందీ లో తనకి ఇమ్మని కోరాడట. కానీ మహేష్ దానికి పెద్ద రేట్ చెప్పినట్టు తెలుస్తోంది. మహేష్ కి సపోర్ట్ ఇస్తున్న నిర్మాతలు సైతం ఎక్కువ రేటు ఎవరిస్తే వారికే అమ్ముతాం అన్నారట. దానికి షాక్ తిన్నాడు కరణ్. తనకి సినిమా ఇమ్మంటే మహేష్ రాజమౌళి లాగా హ్యాపీగా ఇచ్చేస్తాడు అనుకున్నాడు మొదట్లో కానీ అది జరగకపోవడం షాక్ కాదేంటి .. మహేష్ మరీ రాజమౌళి అంత అమాయకుడు కాదు అని అంటున్నారు విశ్లేషకులు.