ప్రేమికులారా జాగ్ర‌త్త‌.. దారుణ‌మైన చావులు అవ‌స‌ర‌మా..

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ న‌వ జంట ఏడాది తిర‌గ‌కుండానే జీవితాన్నిముగించేసింది. పెద్ద‌ల‌ను ఎదిరించి ఒక్క‌ట‌వుతామ‌నుకున్న వాళ్లు దేవుడి ద‌గ్గ‌ర‌కు ఒక్కొక్క‌రిగా వెళ్లిపోయారు. ఏపీలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న భ‌విష్య‌త్ ప్రేమికుల‌కు గుణ‌పాఠంగా త‌యారైంది.

శ్రీ‌కాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండ‌లంలోని పెయిల‌వాని పేట గ్రామానికి చెందిన హేమ‌సుంద‌ర‌రావు ఎన్‌.ఎల్‌.పేట మండ‌లం చింత‌ల‌బ‌డ‌వంజ గ్రామానికి చెందిన శిరీష ప్రేమించుకున్నారు. వీరిద్ద‌రూ ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అయితే వీరి ప్రేమ గురించి ఇంట్లో పెద్ద‌వాళ్ల‌కు చెప్ప‌డంతో అంగీక‌రించ‌లేదు. దీంతో 2019 జూన్‌లో ఓ ఆల‌యానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు.

అయితే ఇన్ని రోజులు బాగానే ఉన్న వీరి వైవాహిక జీవితంలో ఏడాదిలోనే మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ నెల 2వ తేదీన శిరీష ఇంట్లో అప‌స్మార‌క స్థితిలో చేరుకుంది. దీంతో హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌గా అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే మృతురాలి త‌ల్లి శిరీష భ‌ర్త హేమ‌సుంద‌ర‌రావుపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

ఈ నెల 5వ తేదీన హేమ సుంద‌రరావు మ‌త్తు మంజు ఇంజెక్షన్ న‌రానికి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న శిరీష్ హేమ‌సుంద‌ర‌రావులు ఏడాదికే త‌నువు చాలించారు. అయితే వీరి చావుల‌కు కార‌ణం మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. పోలీసులు విచారిస్తున్నారు. ఏదిఏమైనా త‌ల్లిదండ్రుల‌ను కాద‌ని ప్రేమ వివాహం చేసుకున్న వారు ఇలా అర్ధాంత‌రంగా చ‌నిపోవ‌డంతో ఆ ప్రాంతంలో విషాధ ఛాయ‌లు అలుముకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here