టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చూసిన ఆయన మళ్లీ పార్టీని బలంగా తయారుచేయడానికి రెడీ అవుతున్నారని టాక్. అందుకే ఏ ఏ జిల్లాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్లాన్ వేస్తున్నారు.
ముందుగా రాయలసీమ ప్రాంతం నుంచి ఆయన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారంట. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పార్టీ పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకత గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా అనంతపురం, చిత్తూరుపైనే ఫోక్ ఉండనుందని సమాచారం. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో టిడిపికి అభిమానులు ఎక్కువ. కర్నూల్లో కూడా మంచి క్యాడర్ ఉన్నప్పటికీ జిల్లాల్లో దశాబ్దం నుంచి పార్టీ నేతలెవ్వరూ ఊహించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్నారు.
ఇక కడప జిల్లాలో కూడా సేమ్ సీన్. వై.ఎస్ఆర్ ఉన్నప్పుడే కడపను టిడిపి దాదాపుగా మర్చిపోయింది. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా కడప జిల్లా అభివృద్ధి గురించి చాలా సార్లు మాట్లాడారు. మొత్తం మీద కడప, కర్నూలు కాకుండా అనంత, చిత్తూరుపై టిడిపి ఆశలు ఉన్నట్లు సమాచారం. అందుకే ఇప్పటి నుంచే క్యాడర్తో మాట్లాడుతూ పార్టీ పరంగా ధైర్యం నింపే కార్యక్రమాలు వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంట.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నేతలకు మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అధిష్టానం భావిస్తుందట.