దక్షిణాది రాష్ట్రాల్లో తమకంటూ ఒక ప్రత్యెక బలం పెంచుకోవడం కోసం జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రణాలికలు రచిస్తున్నారు అని తెలిసిందే. రాజకీయ శూన్యత ఘాడంగా ఉన్న తమిళనాడు లో తమ పాగా వేస్తే సౌత్ ఇండియా మొత్తం తమ గుప్పెట్లోకి తెచ్చుకోవచ్చు అనే ప్లాన్ లో ఉన్నారు ఆయన. తాజాగా పుదుచ్చేరి పర్యటన లో ఉన్న ఆయన ఒక తమిళ దిన పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రజినీకాంత్ తో సహా అనేక విషయాల గురించి మాట్లాడారు. అన్నా డీఎంకే అంతర్గత విషయాల్లో తలదూర్చే ప్రసక్తే లేదు అన్న ఆయన తమిళ జనాల మేలు కోసం తాము ఎప్పటికీ నిలిచి ఉంటాం అన్నారు.
తమిళ నాడు లో క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతం చెయ్యడం తమ లక్ష్యం అన్నారు. బూత్ స్థాయి నుంచే ప్రత్యేకంగా టీం లు ఏర్పాటు చెయ్యబోతున్నాం అని ప్రకటించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కి జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది అనీ ఆయన ముందుగా సందిగ్ద్గత వదిలి జనాల్లోకి వస్తే అప్పుడు కలిసి పనిచేయ్యలా విడివిడిగా చెయ్యాలా అనేది చూస్తాం అన్నారు అమిత్ షా.