ప్రముఖ నేపద్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. గత కొన్ని రోజుల నుంచి తన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయని జలుబు వస్తూ పోతుండడంతో ఎందుకైనా మంచిది అని కరోనా టెస్ట్ చెయ్యగా పాజిటివ్ వచ్చింది అని ఆయన తెలిపారు. ఈ రోజు ఉదయం ఆయన చెన్నై లో ఎంజిఎం హెల్త్ కేర్ హాస్పిటల్ లో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు.
అలాగే వైద్యులు అప్పుడు తనని హోమ్ క్వారంటైన్ లో ఉండమన్నారని కానీ తన కుటుంబ సభ్యుల పరిస్థితి రీత్యా తాను ఆసుపత్రిలో జాయిన్ అయ్యానని తెలిపారు. అలాగే తాను ఇప్పుడు బాగానే ఉన్నానని ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన ముందుగానే చెప్పేసారు. మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని హాస్పిటల్ లో కూడా చాలా బాగా చూసుకుంటున్నారని ఆయన వీడియో పెట్టి తెలిపారు.