ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు: లావణ్య త్రిపాఠి

‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి లావణ్య త్రిపాఠి. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తమిళంలోనూ కొన్ని చిత్రాల్లో నటించింది. ఇదిలా ఉంటే ఈ సొట్టబుగ్గ చిన్నది వెబ్‌ సిరీస్‌లో నటించనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఓ వెబ్‌సిరీస్‌లో లావణ్య త్రిపాఠి నటిందనుందని సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది.

లావణ్య త్రిపాఠి ఈ విషయమై తాజాగా అధికారికంగా స్పందించింది. వెబ్‌ సిరీస్‌లో తాను నటిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని లావణ్య కొట్టేసింది. త్వరలో మూడు చిత్రాల్లో నటిస్తున్నానని, కానీ వెబ్‌ సిరీస్‌లో నటించట్లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే భవిష్యత్తలో అవకాశం వస్తే… మారుతీ సార్‌ దర్శకత్వంలో పనిచేస్తానని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. లావణ్య ప్రస్తుతం.. ‘A1 ఎక్స్‌ప్రెస్‌’, ‘చావు కబురు చల్లగా’ అనే చిత్రాల్లో నటిస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here