అనారోగ్యం బారిన పడిన సాయి ధరమ్‌..

‘చిత్ర లహరి’, ‘ప్రతీ రోజు పండగే’ చిత్రాలతో వరుస విజయాలను అందుకొని ఫుల్‌ జోష్‌ మీదున్నాడు మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌. తాజాగా ఈ యంగ్‌ హీరో ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ పూర్తయింది. డబ్బింగ్‌ పనులు బ్యాలెన్స్‌ ఉంది. అయితే ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్‌ తేజ్‌ అనారోగ్యం బారిన పడడమే దీనికి కారణమని ఓ వార్త టాలీవుడ్‌ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రాన్ని ‘జీ’ సంస్థ డిజిటల్‌ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని, అక్టోబర్‌ 1 నాటికి ఫైనల్‌ కాపీని సదరు సంస్థకు అందించాల్సి ఉండగా డబ్బింగ్‌ పనులు పూర్తికాలేదని తెలుస్తోంది. డబ్బింగ్‌ చెప్పాల్సిన సాయి అనారోగ్యం కారణంగా హాజరు కాలేదని, ఆయన ఇంటి నుంచి బయటకు రావట్లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సాయి ధరమ్‌ తేజ్‌ కరోనా బారిన పడ్డాడా లేదా మరే సమస్య అయినా ఉందా అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ సాయి ధరమ్‌ తేజ్‌కు ఏమైందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here