పవన్ కళ్యాణ్ ని విమర్శించిన కేవీపీ రామచంద్రరావు

కాంగ్రెస్ మాజీ ఎంపీ కెవిపి రామ‌చంద్ర‌రావు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇటీవల ఏర్పాటు చేసిన జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటి మిద తనదైన శైలిలో విమర్శలు చేశారు కెవిపి రామ‌చంద్ర‌రావు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపి ఎలక్షన్ల క్యాంపెయిన్లో చంద్రబాబు పక్కన నిలబడి ఓట్లు అడిగిన పవన్ కళ్యాణ్ చాలా పెద్ద తప్పు చేసారు అని అన్నారు రామ‌చంద్ర‌రావు.
పవన్ కళ్యాణ్ కేవ‌లం జేఎఫ్‌సీ ఏర్పాటు చేసినంత మాత్రాన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా రాద‌ని స్ప‌ష్టం చేశారు.ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో సీనియ‌ర్ నాయ‌కుల‌ను వాడుకుంటున్నారా..? అన్న ప్ర‌శ్న‌కు కేవీపీ స‌మాధాన‌మిస్తూ.. జేఎఫ్‌సీలోకి ఎవ‌ర‌న్నా వ‌చ్చారంటే.. అందుకు కార‌ణం ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై మాత్ర‌మే వ‌చ్చార‌ని, అంతేకానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను చూసి ఎవ‌రూ రాలేద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here