గత కొద్దిరోజులుగా కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని కలిపి విమర్శించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని సినీ క్రిటిక్ కత్తి మహేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధానికి ఇస్తున్న లక్షల కోట్ల నిధులను తమ స్వార్ధం కోసం పక్కదారి పట్టించడంలో సీఎం చంద్రబాబు తన రాజకీయ చాణక్యతకు పదునుపెట్టారని.. చంద్రబాబు లక్షల కోట్ల అవినీతిపై కత్తి మహేష్ ఏకిపారేశారు.
ఈ విషయాలన్నీ ట్విట్టర్ వేదికగా చెప్పారు కత్తి మహేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సొమ్మును చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్తో కలిసి పక్కదారి పట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజా ధనాన్నివేడుకలు విందులతో తెరపైన యాగం చేస్తున్నారని కత్తి మహేష్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధితో కాక అప్పుడే పాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని అన్నారు కత్తి మహేష్.