సీతగా మహేష్‌ హీరోయిన్‌.. ఇదైనా నిజమేనా?

యంగ్‌ రెబల్‌ స్టార్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ డైరెక్షన్‌లో ‘ఆదపురుష్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌, భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై యావత్‌ దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న వార్త సెన్సేషన్‌గా మారుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడుగా, బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిగా, మరో హీరో అజయ్‌ దేవగణ్‌ శివుడి పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీతగా ఎవరు నటిస్తున్నారనే వార్త గత కొన్ని రోజులుగా వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో సీతగా నటించనున్నారన్న జాబితాలో కీర్తి సురేష్‌, అనుష్క శర్మ, కియారా అద్వానీ పేర్లు వినిపించాయి. అయితే చిత్ర యూనిట్‌ మాత్రం అధికారికంగా ఒక్క ప్రకటన చేయలేదు. ఇక తాజాగా మరో హీరోయిన్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. తనే బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కృతీ సనన్‌. ప్రస్తుతం దర్శక నిర్మాతలు కృతి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. కృతీ సనన్‌ గతంలో తెలుగులో మహేష్‌ బాబు హీరోగా నటించిన ‘వన్‌ నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. దీంతో కృతీని తీసుకుంటే తెలుగుతో పాటు హిందీలోనూ ప్లస్‌ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. మరి కృతీ సనన్‌ అయినా సీతగా ఓకే అవుతుందా లేదా.. ఇది కూడా రూమర్‌గానే మిగిలిపోతుందా.? చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here