తన సినిమాపై జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించిన క్రిష్..

క్రిష్ దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా కొన్ని రోజులు ఆగిపోయిన చిత్ర షూటింగ్ తాజాగా తిరిగి ప్రారంభమైంది. అయితే సినిమా చిత్రీకరణ సమయంలో సెట్స్ లో ఎవరికో కరోనా వచ్చిందని.. దీంతో షూటింగ్ మొత్తం ఆపేశారని, అధికారులు కూడా వ్యవహారంపై కన్నేశారని వార్తలు వచ్చాయి.

ఇలా తన సినిమాపై జరుగుతోన్న ప్రచారాన్ని తాజాగా  కొట్టిపారేశాడు దర్శకుడు క్రిష్. తన టీంలో ఎవరికీ కరోనా రాలేదని స్పష్టత ఇచ్చాడు. దీంతో సినిమాపై నెలకొన్న మబ్బులు తొలగిపోయాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. చిత్రంలో  వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here