క్రిష్ దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా కొన్ని రోజులు ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ తాజాగా తిరిగి ప్రారంభమైంది. అయితే సినిమా చిత్రీకరణ సమయంలో సెట్స్ లో ఎవరికో కరోనా వచ్చిందని.. దీంతో షూటింగ్ మొత్తం ఆపేశారని, అధికారులు కూడా ఈ వ్యవహారంపై ఓ కన్నేశారని వార్తలు వచ్చాయి.
ఇలా తన సినిమాపై జరుగుతోన్న ప్రచారాన్ని తాజాగా కొట్టిపారేశాడు దర్శకుడు క్రిష్. తన టీంలో ఎవరికీ కరోనా రాలేదని స్పష్టత ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై నెలకొన్న మబ్బులు తొలగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.