సుశాంత్ ఆత్మహత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి..!

ప్రస్తుతం బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు యావత్ దేశాన్ని ఓ కుదుపు కుదుపుతోంది.ఎక్కడ చూసినా, విన్నా ఇదే వార్త. సుశాంత్ ది ఆత్మహత్య కాదని.. హత్యేనని పలు వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసు చుట్టూ రాజకీయాలు కూడా జరగడంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీంతో సుశాంత్ మరణ మిస్టరీని ఛేదించడానికి ప్రభుత్వం సి బి ఐ ఎంక్వయిరీకి ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది సీనియర్ నటి విజయశాంతి.

‘గతంలో ఎంతో మంది హీరోయిన్స్ అత్యంత దారుణంగా మృతి చెందారు. తెలంగాణలోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి. అప్పుడు ఎందుకు ఇలాంటి విచారణ జరగలేదు. విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చేవి కదా’ అంటూ విజయశాంతి ఫేస్ బుక్ లో సుధీర్ఘ పోస్ట్ పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలపై జరుగుతోన్న అన్యాయాలను కూడా ప్రశ్నించారీ డేరింగ్ హీరోయిన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here