నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తుంటుంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణించినప్పటి నుంచి కొందరు బాలీవుడ్ నటులతోపాటు పలువురు రాజకీయ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చివరికి అధికార పార్టీ నాయకులపై కూడా మాటల దాడులు చేయడంతో విషయం కాస్తా సీరియస్ గా మారింది.
లాక్ డౌన్ సమయం నుంచి మనాలిలో ఉంటున్న కంగనాను ముంబయికి ఇకపై రానిచ్చేది లేదంటూ కొందరు హెచ్చరించిన నేపథ్యంలో కంగనా ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరింది. ‘నేను ఈనెల 9న ముంబయిలో ల్యాండ్ కాబోతున్నాను. ముంబయి ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యే సమయాన్ని కూడా చెప్తాను. ఎవడి అబ్బకైనా దమ్ముంటే వచ్చి నన్ను ఆపండి’ అంటూ కాస్త కటువుగానే ట్వీట్ చేసింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి.