‘కోబలి’ పట్టాలెక్కనుందా..?

‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత రాజకీయాల కారణంగా సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ పైకి దండెత్తడానికి సిద్దమవుతున్నాడు.  తాజాగా పుట్టినరోజు సందర్భంగా ఏకంగా మూడు సినిమాలను ప్రకటించారు పవన్ కళ్యాణ్.

ఇదిలా ఉంటే పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘కోబలి’ అనే ఒక సినిమా రానుందని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కారణాలేంటో తెలియదు కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం మళ్లీ ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఏడేళ్ల క్రితం చర్చలు జరిగిన ‘కోబలి’ సినిమాను ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. మరి త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here