‘క్రాక్‌’ మేకింగ్‌ వీడియో చూశారా.?

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్‌ను తాజాగా చిత్ర యూనిట్‌ తిరిగి ప్రారంభించింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఓ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ‘క్రాక్‌’ మేకింగ్‌ వీడియో పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. కరోనా నేపథ్యంలో సినిమా యూనిట్‌ తీసుకుంటున్న జాగ్రత్తలను ఇందులో చూపించారు. అదే విధంగా వీడియో చివరిలో రవితేజ చెప్పే.. ‘స్టేషన్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో పెట్టుకో’ అని చెప్పే డైలాగ్‌ హైలెట్‌గా ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవితేజ ఒక నిజాయితీపరుడైన పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ద్వారా చాలా రోజుల తర్వాత నటి శృతి హాసన్‌ మళ్లీ వెండి తెరపై మెరవనున్న విషయం తెలిసిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here