జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రజాయాత్ర హాట్ హాట్ గా సాగుతుంది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్నయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజా యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుడు నల్లగొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పవన్ కళ్యాణ్ పొగడటం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు కోమటిరెడ్డి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా వచ్చే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరని ఈ సందర్బంగా దీమా వ్యక్తం చేశారు.