సీతగా కియారా..?

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న చిత్రం ‘ఆది పురుష్’. పాన్ ఇండియా సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విలన్ పాత్రలో రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

దీంతో ఈ చిత్రంలో సీత పాత్రలో ఎవరు నటిస్తారనే అంశం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో సీతగా దక్షిణాది నటి కీర్తి సురేష్ నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ కియారా అడ్వాణీ పేరు వినిపిస్తోంది. చిత్ర యూనిట్ ఇప్పటికే  కియారా అద్వాణీని సంప్రదించినట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here