గులాబీ దళపతి గా కెసిఆర్ మళ్ళీ ఎన్నిక :

తెలంగాణా రాష్ట్ర సమితి 16 వ ప్లీనరీ సిద్దం అయ్యింది. మరొక్క సారి కెసిఆర్ ఆ పార్టీ కి అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. రిటర్నింగ్ అధికారి హోం మంత్రి నాయని నరసింహా రెడ్డి ఈ విషయం ప్రకటించారు. అధ్యక్ష పదవికి నామినేషన్ లలో కెసిఆర్ తరఫున రెండు సెట్ల నామినేషన్ లు వచ్చాయి అన్నారు ఆయన. పార్లమెంట్ సభ్యులు, మండలి సభ్యులు ఒక్కో సెట్ చొప్పున, శాసన సభ్యులు నాలుగు సెట్లు, జడ్పీ చైర్ పర్సన్, కార్పొరేషన్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒక్కో సెట్ చొప్పున కేసీఆర్ పేరిట నామినేషన్లు వేశారని అన్నారు.
దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైందని వెల్లడించారు. కొంపల్లి లో తెరాస ప్లీనరీ కి భారీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రెండు నెలల పాటు టైం తీసుకుని తీరికగా పెద్ద వేదిక తో పాటు జనం ఎక్కువగా సరిపోయేలా ఈ ఏర్పాట్లు పూర్తి చేసారట. పలు తీర్మానాలకి సంబంధించి ఇక్కడ చర్చలు సాగాబోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here