మనదేశంలో రాజకీయ నాయకుల పట్ల సెలబ్రిటీల పట్ల ప్రజలకు చాలా చిన్నచూపు ఉంటుంది. వారే ఏమైనా స్టేట్మెంట్లు ఇచ్చిన పబ్లిక్ లో టాక్ వేరేలా ఉంటుంది.ఈ క్రమంలో ఫిలిం క్రిటిక్స్ కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేస్తున్న రాజకీయాలపై తోడుదొంగలు ఉంటూ వ్యంగంగా విమర్శించడం సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది. ఉద్దనం కిడ్నీ బాధితుల నుంచి ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యల వరకూ పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రతి సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాస్త ఆలస్యమైనా ప్రతిస్పందించడం జరుగుతూ వస్తోంది.
మొత్తానికి దీన్నిబట్టి పవన్ లేవనెత్తిన సమస్యల వల్ల పరిష్కారం మంచి జరుగుతుందా? లేదా అనేది పరిశీలిస్తే…..మంచే జరుగుతుంది..ఈ మధ్యరాష్ట్రంలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి ఫాతిమా కాలేజీవిద్యార్థుల సమస్య దృష్టికి తేవడంతో..దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కు లెటర్ తో పాటు ట్విటర్ ద్వారా సమస్యను దృష్టికి తీసుకెళ్లడంతో చంద్రబాబు ఫాతిమా కాలేజీ లో విషయంలో స్పందిం చడం జరిగింది.ఈ విషయమై కత్తి మహేష్ వ్యంగ్యంగా కామెంట్లు చేయడంతో.
కత్తి మహేష్ పవన్ ని చంద్రబాబు తో త్తు అనేవారు ఉన్నట్లే… కత్తి మహేష్ జగన్ తొత్తు అనే విమర్శించే వారు కూడా ఉన్నారు…ఇది కత్హి మహేష్ కు ఇష్టమా కాదా అన్నది ఆయన ఇష్టం అని కొందరు అంటున్నారు.ఈ ప్రజాస్వామ్యంలో ఆయనకు ఎవరినైనా విమర్శించే హక్కు పార్టీని విమర్శించే హక్కు ఉంది…కానీ అంతమాత్రాన మంచి విషయాల పై కూడా వ్యంగ్యంగా మాట్లాడితే అది సరైన పద్ధతి కాదని కత్తి మహేష్ తెలుసుకోవాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ వస్తే ప్రతీ సమస్యకుపరిష్కారం దొరుకుతుంది కాబట్టి కత్తి మహేష్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు కొంతమంది.