పవన్ కళ్యాణ్ మీద సంచలనకారమైన ట్వీట్ చేసిన కత్తి మహేష్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ గతంలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి రెండు తెలుగు రాష్ట్రాలలో. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కత్తి మహేష్ ను భీభత్సంగా ఆడుకున్నారు. అలాగే కత్తి మహేష్ కూడా వారికి సెటైర్లు వేస్తూ తగిన రీతిలో ప్రతిస్పందించే వారు. అయితే ఈ గొడవ ఇలా ముదురుతున్న నేపథ్యంలో రెండు వర్గాల వారు కలుగజేసుకుని రాజీ కుదుర్చారు. దీంతో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకటయ్యారు.

అయితే ఈ క్రమంలో అప్పుడప్పుడు కత్తి మహేష్ మాత్రం పవన్ కళ్యాణ్ మీద ఆయన కుటుంబం మీద సెటైర్లు వేస్తూనే ఉన్నారు..అయితే తాజాగా కత్తి మహేష్ ట్విట్టర్  వేదికగా మరోసారి చెలరేగిపోయారు పవన్ కళ్యాణ్ మీద……”పాచిపోయిన లడ్డుల్ని”పరీక్షించడానికి నిజనిర్ధారణ కమిటీ కావాల్సి వచ్చిందా పవన్ కళ్యాణ్? ప్రత్యేకహోదాపై నీ నిబద్ధత ఎక్కడ? JAC బదులు JFFC ఎందుకొచ్చింది?ఎన్ని మాటలు మారుస్తావు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎలా ఏమారుస్తావు? అని ట్వీట్ చేశాడు. తాజాగా కత్తి మహేష్ చేసిన ట్వీట్ మీద పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here