ప్రకాశం జిల్లా అద్దంకి నియోజికవర్గం లో తమ వర్గీయులు ఇద్దరినీ అత్యంత దారుణంగా హత్య చెయ్యడం మీద అక్కడి ఎమ్మెల్సీ కారణం బలరాం కుమారుడు కర్ణం వెంకటేష్ మాట్లాడారు. దీనికి కారణం ఎమ్మెల్యే గొట్టిపాటి రవి అని ఆయన ఓపెన్ గా చెప్పేసారు. ఇదివరకే చాలా మంది వైకాపా వారిని మోసం చేసిన అతను టీడీపీ లోకి వచ్చి 95 వేల మంది కార్యకర్తలని మోసం చేస్తున్నాడు అన్నారు.
” అతనొక నపుంసకుడు .. స్వలాభం కోసం ఆయన టీడీపీ లో చేరారు ” అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాట రాకూడదనే కారణంతోనే తాము ఓపికపడుతున్నామని… లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు.