రేప్ చేయడం కోసం కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపిన టాప్ హీరో

కూల్ డ్రింకులో మత్తుమందు కలిపిన ‘హోంబణ్ణ’ చిత్ర హీరో సుబ్రహ్మణ్య, తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని 23 సంవత్సరాల యువతి పోలీసులను ఆశ్రయించింది. బెంగళూరు బసవగుడి మహిళా పోలీసు స్టేషన్లో నమోదైన కేసు మరిన్ని వివరాల్లోకి వెళితే, రాజాజీనగర్ కు చెందిన యువతికి, సుబ్రహ్మణ్యకు పాత పరిచయం ఉంది. వీరు ప్రేమలో పడగా, పెద్దలు కూడా పెళ్లికి అంగీకరించారు.

‘హోంబణ్ణ’ సినిమా షూటింగ్ తరువాత పెళ్లి చేసుకుంటానని సుబ్రహ్మణ్య మాటిచ్చాడు. ఈలోగా తన సిస్టర్ ఇంట్లో పార్టీ ఉందని యువతికి చెప్పిన సుబ్రహ్మణ్య ఆమె రాగా, మత్తు మందిచ్చాడు. ఆపై అత్యాచారం చేశాడు. తనకేమయిందో తెలుసుకున్న తరువాత ఆమె పెళ్లికి ఒత్తిడి చేయగా, తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, సుబ్రహ్మణ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here