మనసులో ఉన్న దాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే హీరోయిన్లలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఒకరు. ఇటీవల నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసంచేస్తోందీ బ్యూటీ. అయితే కేవలం కాంట్రవర్సీలకే కాకుండా డెడికేషన్లోనూ తనకెవరూ సాటిలేరని చాటిచెప్పుతోందీ అందాల తార. కంగనా ఇటీవల.. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కంగనా ఏకంగా 20 కిలోల బరువు పెరిగింది. ఇక ఇటీవల హైదరాబాద్లో జరిగిన షూటింగ్లో పాల్గొన్న కంగనా తిరిగి తన స్వస్థలం హిమాచల్ ప్రదేశ్కు వెళ్లింది.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న కంగనా విశ్రాంతి తీసుకోకుండా వర్కవుట్లు మొదలు పెట్టింది. జయలలిత సినిమా కోసం పెరిగిన బరువును మళ్లీ తగ్గించుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే యోగాసనాలు చేస్తోన్న సమయంలో దిగిన ఓ ఫొటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన కంగనా.. ‘జయలలిత పాత్ర కోసం 20 కిలోల బరువు పెరిగాను. మళ్లీ ఇంతకుముందులా కనిపించడానికి, అప్పటిలా హుషారుగా, చురుకుగా ఉండడానికి జాగింగ్ వెళ్తున్నాను. బరువు తగ్గడానికి యోగాసనాలు, వ్యాయామం, జాగింగ్ చేయడం ప్రారంభించాను’ అని రాసుకొచ్చిందీ బ్యూటీ. ఈ ఫొటోలు చూసిన ఆమె అభిమానులు నటన పట్ల కంగనాకు ఉన్న డెడికేషన్కు ఫిదా అవుతున్నారు.
I had gained 20kgs for Thalaivi, now that we are very close to completing it, need to go back to my earlier size, agility, metabolism and flexibility. Waking up early and going for a jog/walk …. who all are with me ? 🙂 pic.twitter.com/4HP6jSRGq5
— Kangana Ranaut (@KanganaTeam) October 14, 2020