గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం యావత్ సినీ జగతిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన గాన మాధుర్యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బాలుకు భరతరత్న ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి… బాలసుబ్రమణ్యంకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా నటుడు కమల్ హాసన్ జగన్ మోహన్ కు ఈ విషయమై కృతజ్ఞతలు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి రాసిన లేఖను ట్విట్టర్ లో షేర్ చేసిన కమల్… తమిళనాడులోనే కాకుండా దేశంలో బాల సుబ్రహ్మణ్యంను నిజంగా అభిమానించే వారంతా ఆయనకు ఈ గౌరవం దక్కాలని కోరుకుంటున్నారని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ఇక ఇదే విషయమై బాలు తనయుడు చరణ్ మాట్లాడుతూ… తన తండ్రే తమకు పెద్ద భారత రత్న అని, ఒకవేళ ఆయనకు భారత రత్న పురస్కారం ఇస్తే స్వాగతిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.