గత కొన్ని రోజులుగా కాజల్ పెళ్లిపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబయికి చెందిన పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లుని వివాహాం చేసుకోనున్నట్లు నిన్నంతా వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈరోజు ఎట్టకేలకు ఈ వార్తలపై అధికారింగా స్పందించింది టాలీవుడ్ చందమామ. ట్విట్టర్ వేదికగా తన వివాహా విషయమై ఓ క్లారిటీ ఇచ్చింది.
ఈ విషయమై ట్విట్టర్లో పోస్ట్ చేసిన కాజల్.. ‘ఈ నెల 30న ముంబయిలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోనున్నానని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మా దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుంది. కరోనా మహమ్మారి మన సంబరాలను పూర్తి స్థాయిలో జరుపుకోనివ్వకుండా చేసింది. అయినప్పటికీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు మాకు చాలా థ్రిల్గా ఉంది. ఇన్నేళ్లుగా మీరు నాపై చూపిస్తోన్న ప్రేమకు ధన్యవాదాలు. ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతోన్న నేపథ్యంలో మీ ఆశీర్వాదాలను మేము కోరుకుంటున్నాము. పెళ్లి తర్వాత కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంటాను’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న కాజల్కు మనమూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా మరి.!
— Kajal Aggarwal (@MsKajalAggarwal) October 6, 2020