మా మీద నమ్మకం పెట్టుకోవద్దు : పవన్ కళ్యాణ్ జేఎఫ్ సీ ముఖ్య సభ్యుడు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చాయి అని తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ ‘జాయింట్ ఫాక్ట్ ఫౌండేషన్ కమిటీ’(జేఎఫ్ సీ)ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ముఖ్య సభ్యులుగా లోక్ సత్తా అదినేత జయప్రకాష్ నారాయణ్, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులను పవన్ కళ్యాణ్ తీసుకొన్నారు. అయితే తాజాగా జేఎఫ్ సీ సమావేశం హైదరాబాద్ దస్పాల్ హోటల్ లో జరిగింది.

ఈ సమావేశానికి హాజరైన జయప్రకాష్ నారాయణ్ సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ తమపై ఏపీ ప్రజలు ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. మేము కేవలం నిధుల విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని లెక్కలు అడిగి మరి సరిచేస్తాం.మమ్మల్ని ఆకాశానికి ఎత్తేయద్దు.అలా అని మాపై ఎక్కువగా ప్రజలు నమ్మకం పెట్టుకోవద్దు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్రంలో ఉన్న మిగతా రాజకీయ నాయకులు జేపీ వ్యాఖ్యలు విని మీమీద మీకే నమ్మకం లేనప్పుడు ఇంత హడావుడి ఎందుకు అని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here