లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రంలో ఉన్న స్వతంత్ర నిపుణుల బృందం మొదటి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అంటూ తేల్చేశారు. విభజన నేపథ్యంలో ఆనాడు అధికారంలో ఉన్న యూపీఏ ఇచ్చిన ప్రధాన హామీలతో ఒక ప్రత్యేక హోదాను తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ తుంగలో తొక్కింది అన్నారు .
ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు జయప్రకాశ్ నారాయణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు మొదట్లో రాష్ట్ర ప్రజల గురించి ఆరాటం ప్రస్తుతం లేదు. పవన్ ప్రస్తుతం రాజకీయాలకు పనికిరాడు.మరుగున పడి ఉన్న ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చిందే నేను .అందరూ మరిచిపోయిన ప్రస్తుత రోజుల్లో దాని గురించి మాట్లాడటానికి కారణం నేనే ..రాష్ట్రంలో వెనకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు .. అంతేకాకుండా విశాఖపట్టణానికి రైల్వేజోన్ విషయంలో కూడా కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here