పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ లు ఒక్కటికానున్నారా..? 2019 ఎన్నికల్లో పొత్తు కోసం ఎత్తులువేస్తున్నారా..? తాను మద్దతిచ్చిన టీడీపీని దూరం పెడుతూ…వైసీపీ కి దగ్గరవుతున్నారా..? అంటే అవుననే అనిపిస్తుంది. పవన్ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే.
ఏపీ ప్రత్యేక హోదాకోసం వైసీపీ నేతలు పోరాటం చేయడం ఎంతో స్పూర్తి దాయకం..!! ఈ మాట అన్నది ఎవరో కాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఓ వైపు వైసీపీ ని పొగుడుతూనే టీడీపీ నేతల్ని చెడుగుడు ఆడాడు. అయితే ఈ మాటల్ని బట్టి చూస్తుంటే జగన్ తో దోస్తీకి జనసేనాని ఉవ్విళ్లూరుతున్నారని అనిపిస్తుంది.
ఎన్నికల హామీలకు తిలోదకాలిచ్చిన టీడీపీని గద్దె దించేందుకే ప్రజలు ఎదురు చూస్తున్నారు.2019 ఎన్నికల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఆకాశం వైపు చూస్తున్నారు. బాబు వస్తే జాబు వస్తున్న మాటలకు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయం లేదు. కాంగ్రెస్ కు ఊపు ఎప్పుడొస్తుందో తెలీదు. 2019 ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అధికారంతో టీడీపీ అవినీతి పేట్రేగింపుతుంది. ఈ తరుణంలో రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది. ప్రతిపక్షనేత జగన్ , పవన్ కల్యాణ్. రాష్ట్రాభివృద్ధికోసం ఇద్దరు చేతులు కలిపితే తప్పులేదు.
అదే విషయాన్ని పవన్ కొన్నిసార్లు బాహటంగా చెప్పిన సందర్భాలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న పవన్..జగన్ తో సావాసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పవన్ వైసీపీ ఎంపీ లను సపోర్ట్ చేయడం కొంచెం ఆలోచించదగ్గ విషయమే.