డిల్లీ వెళ్ళిన వైకాపా లీడర్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితమే డిల్లీ విమానాశ్రయం లో ల్యాండ్ అయ్యారు. కొద్ది సేపటి క్రితం ఆయన మోడీ తో భేటీ అయ్యి అనేక విషయాలు మాట్లాడారు. మిర్చి రైతుల సమస్య్లల గురించి ప్రధానంగా ప్రస్తావించిన జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలను మోదీ దృష్టికి తీసుకు వెళ్లారు.
పార్టీ లో ఫిరాయింపు దారుల గురించి , వారిని చంద్రబాబు కొనేసి మరీ ఏపీ క్యాబినెట్ లో స్థానం ఇవ్వడం మీదా లిఖిత పూర్వక ఫిర్యాదు చేసారు. విభజన తరవాత తలెత్తిన అనేక సమస్యల గురించి జగన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీని కలిసేందుకు గత కొంత కాలంగా జగన్ ప్రయత్నిస్తున్నారు. చాలా కాలం తరవాత ఇన్నాళ్ళకి మోడీ అప్పాయింట్మెంట్ సంపాదించారు జగన్ .