పరిపాలించడం అంటే ఏమిటో నేను చేసి చూపిస్తా: వైయస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తున్న జగన్ తో పాటు అనేకమంది జగన్ వేస్తున్న అడుగుల్లో అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర నెల్లూరు జిల్లాలో సాగుతోంది. ఈ సందర్భంగా జగన్ పాదయాత్రలో భాగంగా భాగంగా ఓ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అయితే ఈ సందర్భంగా జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేకప్రశ్నలకు జవాబులు ఇవ్వడం జరిగింది.

ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు జగన్ సంచలన కరమైన జవాబు ఇచ్చారు. ఇంతకి ప్రశ్న ఏమిటంటే……. ముఖ్యమంత్రిగా చంద్రబాబుగా ఉన్న సమయంలో నాడు మీ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేశారు. నేడు మీరు చేస్తున్నారు. నాటికి, నేటికి ఏమన్నా తేడా ఉందా..? అన్న ప్రశ్నకు జగన్‌ సమాధానమిస్తూ.. 2019లో హిస్టరీ రిపీట్స్‌ అంటూ సమాధానం ఇచ్చారు.ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చి మొత్తం రాష్ట్రం భ్రష్టు పట్టడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని జగన్  చెప్పారు.

ఏదిఏమైనా అధికారంలోకి వచ్చాక కచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారు జగన్. అంతేకాకుండా దేవుడి దయవల్ల ప్రజలందరి ఆశీస్సుల వల్ల అధికారంలోకి వైయస్ఆర్ సీపీ పార్టీ వచ్చాక పరిపాలన అనేది ఎలా ఉంటుంధో వీరందరికీ నేను చేసి చూపిస్తానంటూ సమాధానమిచ్చారు వైఎస్‌ జగన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here