తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత హార్ట్ అటాక్ తో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమెకి వైద్యం అందించిన ఆసుపత్రి అఫీషియల్ సిబ్బంది , అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా అదే విషయం చెబుతోంది. కానీ ఆమె చావుకి సంబంధించి అనేక న్యూస్ లు, పుకార్లు ఇంకా బయట ప్రపంచం లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. జయలలిత మృతిపై సోషల్ మీడియాలో సరికొత్త కథనం హల్ చల్ చేస్తోంది. దీని వివరాల ప్రకారం… అపోలో ఆసుపత్రి వైద్యుల చికిత్సతో జయలలిత బాగా కోలుకున్నారు.
ఈ స్ధితిలో డాక్టర్ల అనుమతి లేకుండా ఆమె తాగిన పండ్ల రసం వల్లే గుండెపోటుకు గురయ్యారు. పండ్ల రసం తాగడం అంటే చాలా ఇష్టం అయిన జయలలిత ఆఖరి రోజుల్లో విపరీతంగా అవి తీసుకున్నారు అనీ ఆమె తాగిన పండ్లు ఆమె హెల్త్ ని తీవ్రంగా దెబ్బ తీసాయి అని , ఆమె జూస్ లు తాగిస్తూ ఉంటె డ్యూటీ నర్స్ లు కూడా అడ్డుకోలేదు అంటూ ప్రచారం నడుస్తోంది