బాహుబలి 1 సినిమా విడుదల అయిన తరవాత తనకి జరిగిన బెస్ట్ అనుభవాలలో కొన్నింటికి ప్రభాస్ తన ఫాన్స్ తో పంచుకున్నాడు. బాహుబలి 2 ప్రమోషన్ లో భాగంగా ప్రభాస్ ఫాన్స్ ని మీట్ అయ్యాడు. అప్పట్లో మొదటి భాగం వచ్చిన తరవాత డైరెక్టర్ వినాయక్ తననీ రాజమౌళి నీ కలిసాడు అనీ శివగామి ఎందుకు చనిపోయింది అన్న దగ్గర నుంచి సినిమా నిండా ఉండే అనేక ప్రశ్నల గురించి తమ దగ్గర ప్రస్తావిస్తూ ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్న ఈ చిత్రం ఎలా హిట్ అయ్యింది అని తనకి అతిపెద్ద ప్రశ్న ఉండిపోయింది అని వినాయక్ అన్నట్టు చెబుతున్నారు.
దేవసేన సంకెళ్లతో ఎందుకు ఉంది? అవంతిక అక్కడెందుకుంది? భల్లాలదేవుడి భార్య ఎవరు? వంటి ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయని వినాయక్ అడిగాడని వివరించాడు. ” ఈ సినిమాలో ప్రతీ పాత్ర కీ ఒక కథ ఉంటుంది అంటూ మౌళి ఆయనకి వివరించారు. రెండో భాగం లో ఆన్సర్ లభిస్తుంది అని అప్పుదే చెప్పాం ” అన్నాడు ప్రభాస్