అమితాబ్ బ‌చ్చ‌న్ అలా చేశారంటే న‌మ్మ‌లేక‌పోతున్నారు..

బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్ర‌హంగా ఉన్నారు. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ లాతూర్ ఎస్పీ నిఖిల్ పింగళేకు అమితాబ్ బ‌చ్చ‌న్‌పై ఫిర్యాదు చేశారు. అమితాబ్ నిర్వ‌హిస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి 12లో హిందూవుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా వ్యాఖ్యానించార‌ని ఆయ‌న ఫిర్యాదు చేశారు.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన‌ అభిమన్యు పవార్ అత్యంత సన్నిహితుడు. ఇంత‌కీ ఏమైందంటే..శుక్రవారం ప్రసారమైన ‘కరమ్‌వీర్ స్పెషల్’ ఎపిసోడ్‌లో సామాజికవేత్త బెజ్వాడ విల్సన్, నటుడు అనూప్ సోని పాల్గొన్నారు. వీరిని అమితాబ్ ప్ర‌శ్న‌లు అడిగారు. ఇందులో 6.40 లక్షల రూపాయల ప్రశ్నగా 25 డిసెంబరు 1927న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఆయన మద్దతుదారులు ఏ గ్రంథం ప్రతులను తగలబెట్టారు?’ అని ప్రశ్నించారు. ఆప్షన్లుగా (ఎ) విష్ణు పురాణం (బి) భగవద్గీత (సి) రుగ్వేదం (డి) మనుస్మృతి అని నాలుగింటిని పేర్కొన్నారు.

ఇవి నాలుగూ హిందూ మతానికి చెందినవేనని. ఈ ప్రశ్న వెనక హిందువుల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే అంటున్నారు. హిందూ గ్రంథాలను తగలబెట్టవచ్చన్న భావాన్ని ఈ ప్రశ్న ద్వారా వ్యాప్తి చేస్తున్నారని, అంతేకాక, హిందువులు, బౌద్ధుల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఈ ప్రశ్న ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక హింధూవుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here